యుకీ, సోమ్దేశ్ శుభారంభం | Yuki Bhambri, Somdev advance to 2nd round | Sakshi
Sakshi News home page

యుకీ, సోమ్దేశ్ శుభారంభం

Feb 17 2015 5:17 PM | Updated on Sep 2 2017 9:29 PM

ఢిల్లీ ఓపెన్లో భారత టెన్నిస్ ఆటగాళ్లు యుకీ భాంబ్రీ, సోమ్దేవ్ దేవ్వర్మన్ శుభారంభం చేశారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ ఓపెన్లో భారత టెన్నిస్ ఆటగాళ్లు యుకీ భాంబ్రీ, సోమ్దేవ్ దేవ్వర్మన్ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో యుకీ 7-5 7-6(2)తో అలెగ్జాండర్ కుడ్రెవ్సెవ్ (రష్యా)పై విజయం సాధించాడు. మరో మ్యాచ్లో సోమ్దేవ్ 4-6, 2-0 స్కోరుతో ఉన్న దశలో ప్రత్యర్థి అంటోనియో వీక్ (క్రొయేషియా) గాయం కారణంగా వైదొలిగాడు. భారత ఆటగాళ్లు సనమ్ సింగ్, రామ్కుమార్ రామనాథన్ కూడా టోర్నీలో ముందంజ వేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement