చాంగ్వన్ (కొరియా): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్లో వరుసగా తొలి రెండు రోజులు విఫలమైన భారత షూటర్లు మూడో రోజు బోణీ చేశారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో షాజర్ రిజ్వీ రజత పతకం నెగ్గడంతో భారత్ పతకాల ఖాతా తెరిచింది. 87 మంది పాల్గొన్న క్వాలిఫయింగ్లో రిజ్వీ 582 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించాడు. భారత్కే చెందిన జీతూ రాయ్ 38వ, ఓంప్రకాశ్ 11వ స్థానాల్లో నిలిచారు.
టాప్–8లో నిలిచిన వారు ఫైనల్కు అర్హత పొందుతారు. గత నెలలో మెక్సికోలో జరిగిన తొలి ప్రపంచకప్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్న రిజ్వీ ఈసారి 0.2 పాయింట్ల తేడాతో పసిడి పతకాన్ని చేజార్చుకున్నాడు. ఫైనల్లో రిజ్వీ 239.8 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆర్తెమ్ చెర్నుసోవ్ (రష్యా–240 పాయింట్లు) స్వర్ణం, సముయిల్ డాన్కోవ్ (బల్గేరియా–217.1 పాయింట్లు) కాంస్యం గెలిచారు. పురుషుల ట్రాప్ ఈవెంట్లో భారత షూటర్లెవరూ ఫైనల్కు చేరుకోలేకపోయారు. మానవ్జిత్ (117 పాయింట్లు), కైనన్ షెనాయ్ (115 పాయింట్లు), జొరావర్ సింగ్ (114 పాయింట్లు) వరుసగా 24, 36, 41వ స్థానాల్లో నిలిచారు.
రిజ్వీ గురికి రజతం
Published Wed, Apr 25 2018 1:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి
బాధ్యత నాది
కాంగ్రెస్లో పలువురి చేరిక
త్వరగా నిద్రలేవమన్నందుకు చెరువులో దూకి ఆత్మహత్య
జిల్లా ఉండన్నా? పోవన్నా..?
రేపు బాన్సువాడకు రాజ్నాథ్సింగ్ రాక
దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్సే
సకాలంలో పనులు పూర్తి చేయాలి
నేడు సీఎం రేవంత్రెడ్డి రోడ్ షో
తప్పనిసరిగా ఓటు వేయాలి
తప్పక చదవండి
Advertisement