మంజ్రేకర్‌పై అభిమానుల మండిపాటు!

Trolls In Overdrive After Sanjay Manjrekars Tweet - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ : టీమిండియా మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌పై ముంబై వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిదహాస్‌ ట్రోఫీలో భాగంగా భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న మంజ్రేకర్‌  చేసిన ఓ ట్వీట్‌పై అభిమానులు మండిపడుతున్నారు.

‘ముంబైని శుభ్రం చేయడానికి ఓ మంచి చీపురివ్వండి.. ఇది కొలంబలో దొరుకుతుంది. ఎందుకంటే శ్రీలంక ఇప్పటికే స్వచ్చ్‌ శ్రీలంకగా మారిందని’ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ ముంబై వాసులను కించపరిచేలా ఉందని అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. ‘ఐపీఎల్‌ డబ్బులు ఉపయోగించి ముంబైని శుభ్రం చేయవచ్చుకదా’ అని ఒకరంటే.. ‘నువ్వెప్పుడైనా స్వచ్ఛ్‌ కార్యక్రమంలో పాల్గొన్నావా’ అని మరొకరు ప్రశ్నిస్తున్నారు. జనాభా ఎక్కువ గల ముంబైని ఓ చిన్న నగరంలో పోల్చడం సరికాదని ఇంకొకరు ట్రోల్‌ చేస్తున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top