పేస్‌ జంట పరాజయం | The pair lost in the pace | Sakshi
Sakshi News home page

పేస్‌ జంట పరాజయం

Jan 5 2017 12:56 AM | Updated on Sep 5 2017 12:24 AM

భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌కు కొత్త ఏడాది కూడా కలసిరాలేదు.

చెన్నై: భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌కు కొత్త ఏడాది కూడా కలసిరాలేదు. చెన్నై ఓపెన్‌లో కొత్త భాగస్వామి ఆండ్రీ సా (బ్రెజిల్‌)తో కలసి బరిలోకి దిగిన పేస్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. దివిజ్‌ శరణ్‌–పురవ్‌ రాజా (భారత్‌) జంట 6–4, 6–4తో పేస్‌–ఆండ్రీ సా ద్వయంపై సంచలన విజయం సాధిం చింది.

ఇతర తొలి రౌండ్‌ డబుల్స్‌ మ్యాచ్‌ల్లో సాకేత్‌–రామ్‌కుమార్‌ (భారత్‌) జోడీ 4–6, 6–0, 5–10తో డార్సిస్‌ (బెల్జియం)–పెయిర్‌ (ఫ్రాన్స్‌) జంట చేతిలో ఓడిపోగా... బోపన్న–జీవన్‌ (భారత్‌) జోడీ 6–4, 6–4తో మార్సెలో (బ్రెజిల్‌)– మెక్‌టిక్‌ (క్రొయేషియా) ద్వయంపై గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement