టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా

T20 Against West Indies India Won Toss Decided To Bat - Sakshi

లాడర్‌హిల్‌ (అమెరికా): మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం లాడర్‌హిల్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతోంది. తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగిన జట్టునే రెండో మ్యాచ్‌లోనూ ఇండియా కొనసాగిస్తోంది. విండీస్‌ కూడా ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది.

జట్లు
భారత్‌: విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, మనీష్‌ పాండే, పంత్‌, కృనాల్‌, జడేజా, భువనేశ్వర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఖలీల్‌, సైనీ

విండీస్‌: బ్రాత్‌వైట్‌(కెప్టెన్‌), పొలార్డ్‌ క్యాంప్‌బెల్‌, లూయిస్‌, హేట్‌మేయర్‌, పావెల్‌, బ్రాత్‌వైట్‌, నరైన్‌, కాట్రెల్‌, పాల్‌, థామస్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top