ప్రపంచ జూ. చాంపియన్‌షిప్‌కు స్నేహిత్‌

Snehit to represent India in World Junior TT Championship - Sakshi

భారత టీటీ జట్టుకు ఎంపిక  

సాక్షి, హైదరాబాద్‌: టేబుల్‌ టెన్నిస్‌ క్రీడలో దూసుకుపోతున్న హైదరాబాద్‌ క్రీడాకారుడు ఎస్‌ఎఫ్‌ఆర్‌ స్నేహిత్‌ ప్రతిష్టాత్మక ‘ప్రపంచ జూనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌’లో పాల్గొననున్నాడు. ఆస్ట్రేలియాలో డిసెంబర్‌ 2 నుంచి 9 వరకు జరుగనున్న ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును సోమవారం ప్రకటించారు. ప్రస్తుతం ప్రపంచ జూనియర్‌ ర్యాంకింగ్స్‌లో 48వ స్థానంలో ఉన్న స్నేహిత్‌ భారత టీటీ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

అండర్‌–18 స్థాయిలో ప్రపంచ జూనియర్‌ టీటీ చాంపియన్‌షిప్‌ జరుగుతుంది. గతేడాది ఇటలీలో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లోనూ స్నేహిత్‌ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మరోసారి జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌ తరఫున సత్తా చాటేందుకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని స్నేహిత్‌ హర్షం వ్యక్తం చేశాడు. ఈ టోర్నీకి ముందు నవంబర్‌ 27 నుంచి 30 వరకు జరిగే పోర్చుగల్‌ ఓపెన్‌లో టైటిల్‌ సాధించడమే లక్ష్యం గా బరిలో దిగుతానన్నాడు. భారత జట్టుకు ఎంపి కైన స్నేహిత్‌ను గ్లోబల్‌ టేబుల్‌ టెన్నిస్‌ అకాడమీ (జీటీటీఏ) యాజమాన్యం అభినందించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top