క్వార్టర్స్‌లో సానియా జోడి

క్వార్టర్స్‌లో సానియా జోడి


మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్

 మాడ్రిడ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాడ్రిడ్ ఓపెన్ టోర్నీ డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.  బుధవారం జరిగిన రెండో రౌండ్‌లో ఐదో సీడ్ సానియా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి 6-4, 6-1 తేడాతో హావ్ చింగ్ చాన్ (చైనీస్ తైపీ)-చానెలే షీపర్స్ (చైనా) జంటపై వరుస సెట్లలో గెలుపొందింది.

 

 ఇటీవలే పోర్చుగల్ ఓపెన్ టైటిల్ గెలుచుకుని ఊపుమీదున్న సానియా ద్వయం తొలి సెట్‌లో ఒక దశలో 4-1తో దూసుకెళ్లింది. అయితే చాన్-షీపర్స్ జోడి పోరాట పటిమ కనబరిచి ఆధిక్యాన్ని 3-4కు తగ్గించింది. తిరిగి పట్టు సాధించిన సానియా-కారా ద్వయం తొలిసెట్‌లో నెగ్గడంతోపాటు రెండో సెట్‌ను అలవోకగా కైవసం చేసుకొని మ్యాచ్‌ను గెలుపొందింది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top