క్వార్టర్‌ ఫైనల్లో కశ్యప్‌ | Sameer Verma and Parupalli Kashyap enter third round | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో కశ్యప్‌

Mar 30 2018 5:10 AM | Updated on Mar 30 2018 5:10 AM

Sameer Verma and Parupalli Kashyap enter third round - Sakshi

ఓర్లీన్స్‌ మాస్టర్స్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ పారుపల్లి కశ్యప్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఫ్రాన్స్‌లో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో కశ్యప్‌ 21–11, 21–14తో జోషువా మాగీ (ఐర్లాండ్‌)పై గెలుపొందాడు. హైదరాబాద్‌కే చెందిన గురుసాయిదత్‌ 20–22, 21–17, 17–21తో జాన్‌ జార్గెన్‌సన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో తెలుగు అమ్మాయి శ్రీకృష్ణప్రియ 18–21, 18–21తో ముగ్ధా అగ్రే (భారత్‌) చేతిలో పరాజయం పాలైంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement