మరో అడుగు దూరంలో సైనా | Saina Nehwal enter into Malaysia Masters Grand Prix Gold tournament | Sakshi
Sakshi News home page

మరో అడుగు దూరంలో సైనా

Jan 21 2017 9:08 PM | Updated on Sep 5 2017 1:46 AM

మరో అడుగు దూరంలో సైనా

మరో అడుగు దూరంలో సైనా

మలేసియా మాస్టర్స్‌ గ్రాండ్‌ ప్రి గోల్డ్‌ టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్, మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్‌ జోరు కొనసాగుతోంది.

సారావక్‌ (మలేసియా): మలేసియా మాస్టర్స్‌ గ్రాండ్‌ ప్రి గోల్డ్‌ టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్  స్టార్, మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్‌ జోరు కొనసాగుతోంది. వరుసగా నాలుగో విజయం సాధించిన టాప్ సీడ్ సైనా టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్లో హాంగ్ కాంగ్ ప్లేయర్ యిప్ పుయ్ యిన్‌పై 21-13, 21-10 తేడాతో సైనా నెగ్గింది. తొలి గేమ్‌లో ప్రత్యర్థి కాస్త ప్రతిఘటించినా సైనా మాత్రం ఈ ఏడాది తొలి టోర్నీని కైవసం చేసుకునేందుకు పోరాడింది. రెండో గేమ్‌లో హాంగ్ కాంగ్ ప్లేయర్ ను ఓడించి మ్యాచ్ నెగ్గి యిన్ పై గెలుపొటముల రికార్డును 6-2గా మెరుచు పరుచుకుంది.

ఫైనల్లో థాయ్‌లాండ్ ప్లేయర్ పోర్నపావీ చోచువాంగ్‌తో తో సైనా తలపడనుంది. మరో సెమీఫైనల్లో పోర్నపావీ చోచువాంగ్ చ్యుంగ్ ఎన్‌గన్ యి పై 21-19, 20-22, 21-18తో నెగ్గి ఫైనల్లో ప్రవేశించింది. గంటా 16 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో రెండో సీడ్ ప్లేయర్‌ ఎన్‌గన్ యికు అనామకురాలు పోర్నపావీ షాకిచ్చి టోర్నీ విజయానికి ఒక్క మెట్టు దూరంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement