ఐపీఎల్‌: ఆ రెండు ఢిల్లీకే సొంతం | Rishab Pant takes Orange Cap Boult gets Purple | Sakshi
Sakshi News home page

May 3 2018 4:00 PM | Updated on May 3 2018 7:00 PM

Rishab Pant takes Orange Cap Boult gets Purple - Sakshi

రిషబ్‌ పంత్‌, ట్రెంట్‌ బౌల్ట్‌

హైదరాబాద్‌ : ఐపీఎల్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే ఆరేంజ్‌ క్యాప్‌, పర్పుల్‌ క్యాప్‌లు ఇప్పుడు ఒకే జట్టుకు సొంతమయ్యాయి. సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌కు ఆరేంజ్‌క్యాప్‌.. అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌కు పర్పుల్‌ క్యాప్‌లు ఇస్తారన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత సీజన్‌లో ఈ రెండిటిని ఒకే జట్టు ఆటగాళ్లు సొంతం చేసుకున్నారు. బుధవారం రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ 69(29 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ఈ పరుగులతో ఈ యువ బ్యాట్స్‌మన్‌ ఆరేంజ్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.

ఇప్పటి వరకు పంత్‌ 9 మ్యాచ్‌ల్లో 180.28 స్ట్రైక్‌రేట్‌తో 375 పరుగులు సాధించాడు. దీంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడు(370)ని వెనక్కి నెట్టాడు. ఇదే మ్యాచ్‌లో.. ఢిల్లీ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ రెండు వికెట్లు సాధించి పర్పుల్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన బౌల్ట్‌ 9.17 ఎకానమితో 13 వికెట్లు సాధించి బౌలర్ల జాబితా అగ్రస్థానంలో నిలిచాడు. బౌల్ట్‌ తర్వాతి స్థానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యువ పేసర్‌ సిద్దార్ధ్‌ కౌల్‌ (9) ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement