రాష్ట్ర పంచాయతీరాజ్ ఖేల్ అభియాన్ (పైకా) మహిళల క్రీడల్లో ఖోఖో టైటిల్ ను రంగారెడ్డి జిల్లా జట్టు కైవసం చేసుకుంది. మెదక్ జిల్లా సంగారెడ్డిలో బుధవారం జరిగిన ఖోఖో ఫైనల్లో రంగారెడ్డి జిల్లా 4-3 స్కోరుతో వరంగల్ జట్టుపై విజయం సాధించింది.
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: రాష్ట్ర పంచాయతీరాజ్ ఖేల్ అభియాన్ (పైకా) మహిళల క్రీడల్లో ఖోఖో ైటె టిల్ను రంగారెడ్డి జిల్లా జట్టు కైవసం చేసుకుంది. మెదక్ జిల్లా సంగారెడ్డిలో బుధవారం జరిగిన ఖోఖో ఫైనల్లో రంగారెడ్డి జిల్లా 4-3 స్కోరుతో వరంగల్ జట్టుపై విజయం సాధించింది.
రంగారెడ్డి జిల్లా జట్టులో రేణుక, స్వాతి, భవాని చక్కటి నైపుణ్యాన్ని కనబర్చారు. వరంగల్ జట్టులో సింధు, దివ్యభారతిలు రాణించారు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో కృష్ణా 5-2తో తూర్పు గోదావరిపై గెలిచింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో రంగారెడ్డి జిల్లా 9-3తో తూర్పు గోదావరిపై, వరంగల్ 3-1తో కృష్ణా జిల్లాపై గెలిచాయి.
వాలీబాల్లో హైదరాబాద్కు మూడో స్థానం
వాలీబాల్ టైటిల్ను పశ్చిమ గోదావరి జట్టు చేజిక్కించుకుంది. కృష్ణా జట్టుకు రెండో స్థానం లభించగా, హైదరాబాద్ జట్టుకు మూడో స్థానం దక్కింది. ఫైనల్లో పశ్చిమ గోదావరి జట్టు 25-20, 8-25, 25-18 స్కోరుతో కృష్ణా జట్టుపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 26-24, 25-23తో మెదక్పై గెలిచింది. సెమీస్లో పశ్చిమ గోదావరి 21-25, 25-10, 25-20తో హైదరాబాద్పై, కృష్ణా 26-24, 26-16తో మెదక్పై నెగ్గాయి.