సింగిల్స్‌ ఫైనల్లో ప్రాంజల

Pranjala in ITF Singles Final - Sakshi

ఐటీఎఫ్‌ టెన్నిస్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. నైజీరియాలోని లాగోస్‌ లాన్‌టెన్నిస్‌ క్లబ్‌ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీ లో ప్రాంజల ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో ఆరోసీడ్‌ ప్రాంజల(భారత్‌) 6–2, 5–0తో నాలుగోసీడ్‌ విక్టోరియా (అర్జెంటీనా)పై గెలుపొందింది. తొలి సెట్‌ను గెలిచిన ప్రాంజల రెండో సెట్‌లోనూ 5–0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో ఆమె ప్రత్యర్థి విక్టోరియా రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top