30 మందితో ఒకేసారి... చెస్ గేమ్‌లు ఆడిన హరికృష్ణ | p harikrisna played chess games with 30 members | Sakshi
Sakshi News home page

30 మందితో ఒకేసారి... చెస్ గేమ్‌లు ఆడిన హరికృష్ణ

Nov 1 2014 12:49 AM | Updated on Sep 2 2017 3:39 PM

30 మందితో ఒకేసారి... చెస్ గేమ్‌లు ఆడిన హరికృష్ణ

30 మందితో ఒకేసారి... చెస్ గేమ్‌లు ఆడిన హరికృష్ణ

బెల్‌గ్రేడ్: సెర్బియాలోని బెల్‌గ్రేడ్ యూనివర్సిటీ ‘వీక్ ఆఫ్ చెస్’ కార్యక్రమంలో భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు.

బెల్‌గ్రేడ్: సెర్బియాలోని బెల్‌గ్రేడ్ యూనివర్సిటీ ‘వీక్ ఆఫ్ చెస్’ కార్యక్రమంలో భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా గురువారం ఒకేసారి 30 మందితో అతను చెస్ గేమ్‌లు ఆడటం విశేషం. సుమారు ఐదు గంటల పాటు సాగిన ఈ 30 గేమ్‌లలో 26 మందిపై హరికృష్ణ విజయం సాధించగా, నలుగురు మాత్రమే భారత గ్రాండ్‌మాస్టర్‌తో తమ గేమ్‌లను ‘డ్రా’గా ముగించగలిగారు. సెర్బియాలో భారత రాయబారిగా ఉన్న నరీందర్ చౌహాన్ దీనిని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా భారత సంస్కృతి, ఆహారపు అలవాట్లు తదితర అంశాలపై ప్రత్యేక ప్రదర్శన కూడా జరిగింది.  2727 ఫిడే రేటింగ్‌తోప్రపంచ ర్యాంకింగ్స్‌లో 23వ స్థానంలో కొనసాగుతున్న హరికృష్ణ...ప్రస్తుతం వివిధ లీగ్ టీమ్ చాంపియన్‌షిప్‌లలో పాల్గొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement