ఆంధ్రప్రదేశ్కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ (54కేజీ) ఏఐబీఏ మహిళల యూత్ అండ్ జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్లో పతకం ఖాయం చేసుకుంది
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ (54కేజీ) ఏఐబీఏ మహిళల యూత్ అండ్ జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్లో పతకం ఖాయం చేసుకుంది.
ఆమెతో పాటు భారత్కు చెందిన సిమ్రన్జిత్ కౌర్ (60కేజీ) కూడా సెమీస్కు చేరుకుంది. కాబట్టి భారత్కు రెండు పతకాలు ఖరారయ్యాయి. గురువారం జరిగిన బౌట్లో జూనియర్ ప్రపంచ చాంపియన్ నిఖత్ ఇటలీకి చెందిన డిసైర్ గల్లిని ఓడించింది.