
కివీస్ కుమ్మేసింది!
మూడు వన్డేల సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ ఘన విజయాన్నినమోదు చేసింది.
క్రిస్ట్చర్చ్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ ఘన విజయాన్నినమోదు చేసింది. బంగ్లాదేశ్ ను 77 పరుగుల తేడాతో ఓడించిన కివీస్ సిరీస్ లో బోణి కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 341 పరుగులు చేసింది. కివీస్ ఆటగాళ్లలో లాథమ్(137;121 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకం సాధించగా, మున్రో(87;61 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకట్టుకుని జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించాడు.
అనంతరం భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ 44.5 ఓవర్లలో 264 పరుగుల పరిమితమై ఓటమి పాలైంది. షకిబుల్ హసన్(59), మోసడెక్ హుస్సేన్(50 నాటౌట్), ముష్కిఫికర్ రహీమ్(42), తమీమ్ ఇక్బాల్(38)లు రాణించినా జట్టును ఓటమి నుంచి రక్షించలేకపోయారు. కివీస్ బౌలర్లో నీషమ్, ఫెర్గ్యుసన్ తలో మూడు వికెట్లు సాధించగా, సౌతీకి రెండు వికెట్లు దక్కాయి.