నిఖత్ ముందంజ
రోహ్తక్: జాతీయ మహిళల ఎలైట్ బాక్సింగ్ చాంపియన్ షిప్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ముందంజ వేసింది. సోమవారం జరిగిన ఫ్లయ్ వెయిట్ కేటగిరి బౌట్లో నిఖత్ 5–0తో అంజూ సాబు (కేరళ)పై గెలిచింది. వెల్టర్ వెయిట్ విభాగంలో తెలంగాణకే చెందిన షేక్ రూహి తన ప్రత్యర్థి జాస్మీ జోస్ (కేరళ)కు వాకోవర్ ఇచ్చింది.
లైట్ వెల్టర్ వెయిట్ బౌట్లో జి. షరా (ఆంధ్రప్రదేశ్) 0–5తో చవోబా దేవి (మణిపూర్) చేతిలో పరాజయం పాలైంది.
సంబంధిత వార్తలు