ఢిల్లీ: గత మ్యాచ్ లో రెండొందల పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన ఢిల్లీ డేర్ డెవిల్స్ కు మరోసారి భారీ సవాల్ ఎదురైంది. శనివారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 213 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై ఆటగాళ్లు లెండిల్ సిమ్మన్స్ (66;43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు), పొలార్డ్(63 నాటౌట్;35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా, పార్ధీవ్ పటేల్(25; 22 బంతుల్లో 3 ఫోర్లు), హార్దిక్ పాండ్యా(29 నాటౌట్;14 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. దాంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబైకి శుభారంభం లభించింది. ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్, పార్దీవ్ పటేల్లు ఆకట్టుకున్నారు. ఈ జోడి తొలి వికెట్ కు 79 పరుగులు జత చేయడంతో ముంబై స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఆ తరువాత సిమ్మన్స్-పొలార్డ్ జోడి కూడా దాటిగా బ్యాటింగ్ చేయడంతో దాదాపు 10 పరుగుల రన్ రేట్ స్కోరు బోర్డుపై నిలిచింది. ఈ క్రమంలోనే సిమ్మన్స్ తొలుత హాఫ్ సెంచరీ చేసి అవుట్ కాగా, ఆపై పొలార్డ్ కూడా అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. ఇక చివర్లో హార్దిక్ పాండ్యా చెలరేగి ఆడటంతో ముంబై రెండొందల మార్కును దాటింది.
సిమ్మన్స్, పొలార్డ్ మెరుపులు
Published Sat, May 6 2017 10:02 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- Telangana: మరో రెండు రోజులు వానలు
Advertisement