భారత్ తరఫున తొలి సెంచరీ ఎవరిదో తెలుసా.. | milestones in indian test cricket | Sakshi
Sakshi News home page

భారత్ తరఫున తొలి సెంచరీ ఎవరిదో తెలుసా..

Sep 21 2016 1:58 PM | Updated on Sep 4 2017 2:24 PM

భారత్ తరఫున తొలి సెంచరీ ఎవరిదో తెలుసా..

భారత్ తరఫున తొలి సెంచరీ ఎవరిదో తెలుసా..

భారత క్రికెట్ జట్టు తన 500వ టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది.

భారత క్రికెట్ జట్టు తన 500వ టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. గురువారం న్యూజిలాండ్తో జరగనున్న ఈ మ్యాచ్.. 1932లో ప్రారంభమైన భారత టెస్ట్ క్రికెట్ ప్రస్థానంలో ఎంతో ప్రత్యేకమైంది. ఈ సందర్భంగా భారత టెస్ట్ క్రికెట్లో మైలురాళ్లుగా చెప్పుకోదగ్గ కొన్ని విశేషాలు మీకోసం..
 
► భారత్ తన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ను 1932లో క్రికెట్కు మక్కాగా పేరుగాంచిన ఇంగ్లండ్లోని లార్డ్స్ మైదానంలో ఆడింది. సీకే నాయుడు తొలి కెప్టెన్.
 
► భారత జట్టు తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ విజయాన్ని రుచి చూసింది 1952లో. చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్పై ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది.
 
► మొదటి టెస్ట్ సిరీస్ విజయం మాత్రం భారత్కు 1971లో దక్కింది. ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన ఈ సిరీస్ను భారత్ 1-0తో గెలుపొందింది.
 
► భారత టెస్ట్ క్రికెట్లో మొట్టమొదటి సారి సెంచరీ సాధించిన బ్యాట్స్మెన్ లాలా అమర్నాథ్.  చెన్నైలో 1933లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో లాలా 118 పరుగులు చేశాడు.
 
► ఇప్పటివరకు సాధించిన విజయాల్లో బంగ్లాదేశ్పై 2007లో సాధించిన విజయమే భారత విజయాల్లో పెద్దది. ఢాకాలో జరిగిన ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్, 219 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.
 
► భారత్ అత్యంత చెత్తగా ఓడింది మాత్రం వెస్టిండీస్ చేతిలో. 1958లో కోల్కతాలో జరిగిన మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్, 336 పరుగుల తేడాతో ఓడింది.
 
► అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సచిన్ టెండుల్కర్ రికార్డు సృష్టించాడు. సచిన్ 200 టెస్టుల్లో 15,921 పరుగులు సాధించాడు.
 
► భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అనిల్ కుంబ్లే. 132 టెస్టుల్లో 619 వికెట్లను కుంబ్లే తన ఖాతాలో వేసుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement