గంభీర్ హాఫ్ సెంచరీ.. కేకేఆర్ విజయం | KKR beats punjab by 8 wickets | Sakshi
Sakshi News home page

గంభీర్ హాఫ్ సెంచరీ.. కేకేఆర్ విజయం

Apr 13 2017 11:27 PM | Updated on Sep 5 2017 8:41 AM

గంభీర్ హాఫ్ సెంచరీ.. కేకేఆర్ విజయం

గంభీర్ హాఫ్ సెంచరీ.. కేకేఆర్ విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పరుగుల తేడాతో విజయం సాధించింది.

కోల్ కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పరుగుల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని 16.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత బ్యాటింగ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు కు దిగిన కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. కేకేఆర్ చేసిన చేసిన ఓపెనింగ్ ప్రయోగం ఫలించింది. ఓపెనర్ క్రిస్ లిన్ గాయం కారణంగా ప్రస్తుతం గైర్హాజరీలో ఉండటంతో అతని స్థానంలో సునీల్ నరైన్ ఓపెనింగ్ లో వచ్చి 18 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సరతో 37 పరుగులు చేశాడు. కెప్టెన్ గౌతమ్ గంభీర్ మరో హాఫ్ సెంచరీ (49 బంతుల్లో 72 నాటౌట్: 11 ఫోర్లు) తో అద్భుత ఇన్నింగ్ ఆడి జట్టును విజయతీరానికి చేర్చాడు. ఊతప్ప(26), మనీశ్ పాండే (16 బంతుల్లో 25 నాటౌట్) రాణించారు.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్ కతాకు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. హషీమ్ ఆమ్లా, వోహ్రాలు దూకుడుగా ఆడటంతో కింగ్స్ పంజాబ్ ఐదు ఓవర్లలోనే 53 పరుగులు చేసింది. అయితే ఆరో ఓవర్ తొలి బంతికి వోహ్రా(28;19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) మొదటి  వికెట్ గా నిష్ర్రమించగా, ఆపై స్వల్ప వ్యవధిలో స్టోనిస్(9) కూడా అవుటయ్యాడు. ఆ తరుణంలో ఆమ్లాకు జత కలిసిన కెప్టెన్ మ్యాక్స్ వెల్ స్కోరు బోర్డును కాసేపు పరుగులు పెట్టించాడు. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడికి గ్రాండ్ హోమ్ కు చెక్ పెట్టాడు.ఆమ్లా(25)ను అవుట్ చేసి కింగ్స్ కు షాకిచ్చాడు.

అనంతరం పరుగు వ్యవధిలోమ్యాక్ వెల్(25;14 బంతుల్లో3 ఫోర్లు, 1 సిక్స్) అవుట్ కావడంతో కింగ్స్ పంబాజ్ ఒక్కసారిగా కష్టాల్లో పడింది. ఆ సమయంలో డేవిడ్ మిల్లర్(28)-వృద్ధిమాన్ సాహా(25)ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరు బోర్డును చక్కదిద్దింది. ఈ జోడి  57 పరుగులు జోడించడంతో కింగ్స్ పంజాబ్ తిరిగి గాడిలో పడింది. అయితే వీరిద్దరూ 155 పరుగుల వద్ద వరుసగా పెవిలియన్ చేరడంతో కింగ్స్ తడబాటుకు గురైంది. ఇక చివరి రెండు ఓవర్లలో 14 పరుగులు రావడంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది.
ఒకే ఓవర్ లో మూడు వికెట్లు..

సత్తాచాటిన ఉమేశ్ యాదవ్
సీజన్ లో ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే కోల్ కతా నైట్ రైడర్స్ పేసర్ ఉమేశ్ యాదవ్ విజృంభించాడు. గురువారం కింగ్స్ పంజాబ్ తో మ్యాచ్ లో నాలుగు వికెట్లు సాధించి తన రాకను ఘనంగా చాటుకున్నాడు. మ్యాక్స్ వెల్, డేవిడ్ మిల్లర్, సాహా, అక్షర్ పటేల్ లను అవుట్ చేసి సత్తా చాటాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement