కోల్‌కతాదే బ్యాటింగ్‌

Kings Punjab Won The toss And Choose To Field Against KKR - Sakshi

టాస్‌గెలిచిన కింగ్స్‌ పంజాబ్‌

కోల్‌కతా : ఐపీఎల్‌-11 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌పంజాబ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన పంజాబ్‌ కెప్టెన్‌ అశ్విన్‌ ఫీల్డింగ్‌ వైపే మొగ్గు చూపాడు. ఈ మైదాన వికెట్‌ చేజింగ్‌ అనుకూలంగా ఉంటందని ఇరు జట్ల కెప్టెన్లు అభిప్రాయపడ్డారు. ఈ మ్యాచ్‌కు ఎలాంటి మార్పులు లేకుండా కోల్‌కతా బరిలోకి దిగుతుండగా.. పంజాబ్‌ జట్టులో స్పల్ప మార్పు చోటు చేసుకుంది.

మోహిత్‌శర్మ స్థానంలో అంకిత్‌శర్మ తుదిజట్టులోకి వచ్చాడు. ఇక కోల్‌కతా 5 మ్యాచుల్లో మూడు గెలిచి రెండు ఓడగా.. పంజాబ్‌ నాలుగింటిలో మూడు నెగ్గింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. క్రిస్‌గేల్‌ భీకర ఫామ్‌లో ఉండటం పంజాబ్‌కు అదనపు బలం కాగా.. సొంత మైదానంలో ఆడటం కోల్‌కతాకు కలిసొచ్చే అంశం.

తుది జట్లు
కోల్‌కతా: సునీల్‌ నరైన్‌, క్రిస్‌లిన్‌, ఉతప్ప, రానా, దినేశ్‌ కార్తీక్‌ (కెప్టెన్‌), రస్సెల్‌, శుభమన్‌ గిల్‌, కుర్రాన్‌, చావ్లా, శివం మావి, కుల్దీప్‌ యాదవ్‌
కింగ్స్‌ పంజాబ్‌: కేఎల్‌ రాహుల్‌, క్రిస్‌ గేల్‌, అగర్వాల్‌, కరుణ్‌ నాయర్‌, ఆరోన్‌ ఫించ్‌, యువరాజ్‌ సింగ్‌, ఆర్‌ అశ్విన్(కెప్టెన్‌)‌, ఆండ్రూ టై, మూజీబ్‌, రాజ్‌పూత్‌, బీబీశ్రన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top