ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో కరమ్‌జ్యోతికి కాంస్యం | India's Karamjyoti Dalal wins bronze at World Para Athletics | Sakshi
Sakshi News home page

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో కరమ్‌జ్యోతికి కాంస్యం

Jul 23 2017 2:52 AM | Updated on Sep 5 2017 4:38 PM

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో కరమ్‌జ్యోతికి కాంస్యం

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో కరమ్‌జ్యోతికి కాంస్యం

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మూడో పతకం లభించింది.

లండన్‌: ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మూడో పతకం లభించింది. మహిళల ఎఫ్‌–55 డిస్కస్‌ త్రో ఈవెంట్‌లో కరమ్‌జ్యోతి దలాల్‌కు కాంస్య పతకం దక్కింది. ఆమె డిస్క్‌ను 19.02 మీటర్ల దూరం విసిరి మూడో స్థానాన్ని సంపాదించింది. ఇంతకుముందు జావెలిన్‌ త్రోలో సుందర్‌ సింగ్‌ గుర్జర్‌ స్వర్ణం, క్లబ్‌ త్రోలో అమిత్‌ సరోహా రజతం సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement