భారత పురుషుల జట్టుకు చుక్కెదురు  | Indian Men Lose to Armenia; Women Held by Italy at Chess Olympiad | Sakshi
Sakshi News home page

భారత పురుషుల జట్టుకు చుక్కెదురు 

Oct 4 2018 1:51 AM | Updated on Oct 4 2018 1:51 AM

Indian Men Lose to Armenia; Women Held by Italy at Chess Olympiad - Sakshi

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లకు పతకం గెలిచే అవకాశాలు మరింత సన్నగిల్లాయి. జార్జియాలో జరుగుతోన్న ఈ మెగా ఈవెంట్‌లో బుధవారం జరిగిన తొమ్మిదో రౌండ్‌లో భారత పురుషుల జట్టు 1.5–2.5తో అర్మేనియా చేతిలో ఓడిపోగా... ఇటలీతో జరిగిన మ్యాచ్‌ను భారత మహిళల జట్టు 2–2తో ‘డ్రా’ చేసుకుంది.

పురుషుల జట్టులో అరోనియన్‌తో ఆనంద్‌; సర్గిసియాన్‌తో హరికృష్ణ; మెల్కుమ్యాన్‌తో ఆధిబన్‌ ‘డ్రా’ చేసుకోగా... మర్టిరోసియాన్‌ చేతిలో శశికిరణ్‌ ఓడిపోయాడు. మహిళల విభాగంలో జిమినా ఓల్గాతో కోనేరు హంపి; మోవిలెనుతో పద్మిని గేమ్‌లు ‘డ్రా’గా ముగించారు. సెడీనాపై హరిక గెలుపొందగా... బ్రునెలో చేతిలో తానియా ఓటమి చవిచూసింది. తొమ్మిదో రౌండ్‌ తర్వాత భారత పురుషుల జట్టు 15వ స్థానంలో... మహిళల జట్టు 16వ స్థానంలో ఉన్నాయి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement