వికాస్, సతీశ్‌లకు కాంస్యాలు | Indian boxers Vikas, Satish settle for bronze medals | Sakshi
Sakshi News home page

వికాస్, సతీశ్‌లకు కాంస్యాలు

Oct 3 2014 1:15 AM | Updated on Sep 2 2017 2:17 PM

వికాస్, సతీశ్‌లకు కాంస్యాలు

వికాస్, సతీశ్‌లకు కాంస్యాలు

ఏషియాడ్‌లో భారత బాక్సర్ల పంచ్ కాంస్యాలతో ముగిసింది. బరిలో మిగిలిన వికాస్ క్రిషన్, సతీశ్ కుమార్‌లు గురువారం సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్యాలతో సంతృప్తి పడ్డారు.

ఇంచియాన్: ఏషియాడ్‌లో భారత బాక్సర్ల పంచ్ కాంస్యాలతో ముగిసింది. బరిలో మిగిలిన వికాస్ క్రిషన్, సతీశ్ కుమార్‌లు గురువారం సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్యాలతో సంతృప్తి పడ్డారు. దీంతో ఓవరాల్‌గా 5 పతకాల (1 స్వర్ణం+4 కాంస్యాలు)తో భారత్ బాక్సింగ్ ఈవెంట్‌ను ముగించింది. గ్వాంగ్‌జౌ క్రీడల్లో భారత బాక్సర్లు రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్యాలతో సత్తా చాటారు.
     
పురుషుల మిడిల్ వెయిట్ (75 కేజీలు) సెమీస్‌లో వికాస్ 1-2తో ప్రపంచ చాంపియన్ జానిబెక్ అల్మికన్లీ (కజకిస్థాన్) చేతిలో ఓడాడు. తొలి రౌండ్‌లో భారత్ బాక్సర్ పంచ్‌ల ధాటికి ప్రత్యర్థికి 9-10తో వెనుకబడ్డాడు. అయితే రెండో రౌండ్‌లో మెరుపు దాడి చేస్తూ 10-9 స్కోరు సాధించాడు. మూడో రౌండ్‌లో కూడా ఇదే జోరు కనబర్చడంతో బౌట్ కజక్ బాక్సర్ సొంతమైంది.
     
సూపర్ వెయిట్ (+91 కేజీలు) సెమీస్‌లో సతీశ్ 0-3తో ఇవాన్ డిచ్కో (కజకిస్థాన్) చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. డిచ్కో దూరం నుంచి విసిరిన బలమైన పంచ్‌లకు సతీశ్ వద్ద సమాధానం లేకపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement