
భారత బాక్సర్లకు 4 పతకాలు
ఆసియా యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. కజకిస్థాన్లో జరిగిన టోర్నమెంట్లో...
న్యూఢిల్లీ: ఆసియా యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. కజకిస్థాన్లో జరిగిన టోర్నమెంట్లో భారత బాక్సర్లు 3 రజతాలు, ఒక కాంస్యం సహా నాలుగు పతకాలు గెలిచారు. అంకుశ్ (60 కేజీ), ఆశిష్ (64 కేజీ), రేయల్ పూరీ (81 కేజీ) రజతాలు సాధించగా... మంజీత్ సింగ్ (+91 కేజీ) కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్లో దహియా 0-3 తో బిలోల్బెక్ (ఉజ్బెకిస్థాన్), ఆశిష్ 0-3 తో అయాతుల్లా (కజకిస్థాన్), పూరీ 0-3తో తుర్సునోవ్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ టోర్నీలో 10 పతకాలతో (6 పసిడి, 1 రజతం, 3 కాంస్యం) కజకిస్థాన్ , 9 పతకాలతో (3 పసిడి, 3 రజతం, 3 కాంస్యం) ఉజ్బెకిస్థాన్ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.