ఎదురులేని ఇండియన్ ఏసెస్ | Indian Aces beat Royals 30-11 | Sakshi
Sakshi News home page

ఎదురులేని ఇండియన్ ఏసెస్

Dec 3 2014 12:57 AM | Updated on Sep 2 2017 5:30 PM

ఎదురులేని ఇండియన్ ఏసెస్

ఎదురులేని ఇండియన్ ఏసెస్

అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ జట్టు ఎదురులేకుండా దూసుకెళుతోంది. మనీలా లెగ్‌లో మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఏసెస్ తాజాగా సింగపూర్‌లోనూ తొలి మ్యాచ్‌లో నెగ్గింది.

యూఏఈ రాయల్స్‌పై 30-11తో గెలుపు  
 ఐపీటీఎల్

 
 సింగపూర్: అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ జట్టు ఎదురులేకుండా దూసుకెళుతోంది. మనీలా లెగ్‌లో మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఏసెస్ తాజాగా సింగపూర్‌లోనూ తొలి మ్యాచ్‌లో నెగ్గింది. మంగళవారం యూఏఈ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 30-11 తేడాతో ఘనవిజయం సాధించింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల విజయాలతో ఏసెస్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ముందుగా మహిళల సింగిల్స్‌లో అనా ఇవనోవిచ్ 6-2తో క్రిస్టినా లడెనోవిక్‌పై గెలుపొందగా మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న, సానియా మీర్జా జంట 6-5తో జిమోన్జిక్, లడెనోవిక్‌పై గెలుపొందింది. ఆ తర్వాత పురుషుల సింగిల్స్‌లో మోన్‌ఫిల్స్ 6-1తో మాలెక్ జాజిరిపై సునాయాసంగా నెగ్గాడు. లెజెండ్స్ సింగిల్స్‌లోనూ సాంటోరో 6-2తో జిమోన్జిక్‌ను మట్టికరిపించాడు. చివరగా పురుషుల డబుల్స్‌లో బోపన్న, మోన్‌ఫిల్స్ 6-1తో జిమోన్జిక్, మారిన్ సిలిచ్‌ను ఓడించారు. మరో మ్యాచ్‌లో మనీలా మావ్రిక్స్ 29-21తో సింగపూర్ స్లామర్స్‌పై గెలిచింది.
 
 ఢిల్లీలో డిమాండ్: సింగపూర్ లెగ్ తర్వాత ఈ నెల 6 నుంచి 8 వరకు ఢిల్లీలో ఐపీటీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లకు మొత్తం టిక్కెట్లు అమ్ముడయ్యాయని టోర్నీ సీఈఓ ఎరిక్ గాట్స్‌చాక్ చెప్పారు. మనీలా, సింగపూర్‌లలో తాము ఆశించిన స్థాయికి మించి ప్రేక్షకులు ప్రత్యక్షంగా టోర్నీని చూశారని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement