విరాట్ సేన ఫీల్డింగ్ | india won the toss and chose to field against srilanka in first one day | Sakshi
Sakshi News home page

విరాట్ సేన ఫీల్డింగ్

Aug 20 2017 2:20 PM | Updated on Nov 9 2018 6:43 PM

విరాట్ సేన ఫీల్డింగ్ - Sakshi

విరాట్ సేన ఫీల్డింగ్

శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఆరంభపు మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి పీల్డింగ్ ఎంచుకుంది.

దంబుల్లా: శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో  జరుగుతున్న ఆరంభపు మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి పీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తొలుత లంకేయుల్ని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. మూడు టెస్టుల సిరీస్‌లో శ్రీలంకను చితక్కొట్టిన కోహ్లి బృందం ఎనలేని ఆత్మవిశ్వాసంతో ఉంది. అలాగే 2019 వన్డే ప్రపంచకప్‌ కోసం జట్టును ఇప్పటి నుంచే తయారు చేయాలనే ఆలోచనతో ఉన్న టీమ్‌ మేనేజిమెంట్‌ ఆ దిశగా ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలనుకుంటోంది. బలహీనంగా కనిపిస్తున్న లంకపై యువ ఆటగాళ్లను పరీక్షించనుంది.

మరొకవైపు టెస్టుల్లో వైట్‌వాష్‌ అనంతరం వన్డే సిరీస్‌ ఆడబోతున్న లంక తీవ్ర ఒత్తిడిలో ఉంది. తమ అభిమానులను తిరిగి ఆకట్టుకోవాలంటే ఈ జట్టు తమ స్థాయికి మించి ప్రదర్శన చేయాల్సిందే. కొత్త కెప్టెన్‌ ఉపుల్‌ తరంగ నేతృత్వంలో నూతనోత్తేజంతో బరిలోకి దిగాలని భావిస్తోంది. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి వన్డే (చాంపియన్స్‌ ట్రోఫీ)లో తామే గెలవడం లంకేయులకు కొద్దిగా ఊరటనిచ్చే విషయం.

శ్రీలంక తుది జట్టు: ఉపుల్ తరంగ(కెప్టెన్), డిక్ వెల్లా(వికెట్ కీపర్), గుణతిలకా, కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, చమరా కపుగెదెరా, వానిందు హసరంగా, తిషారా పెరీరా, లక్షన్ సండాకన్, విశ్వ ఫెర్నెండో, లసిత్ మలింగా

భారత తుది జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్, ఎంఎస్ ధోని, కేదర్ జాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, బూమ్రా, చాహల్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement