భారత జట్టు తొలిసారిగా ఈ ఏడాది చివర్లో డే అండ్ నైట్ టెస్టు ఆడుతుందని ఠాకూర్ ప్రకటించారు.
భారత జట్టు తొలిసారిగా ఈ ఏడాది చివర్లో డే అండ్ నైట్ టెస్టు ఆడుతుందని ఠాకూర్ ప్రకటించారు. న్యూజిలాండ్తో సొంతగడ్డపైనే ఈ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఇంకా వేదికను నిర్ణయించలేదు. అయితే అంతకుముందు జరిగే దులీప్ ట్రోఫీని డే అండ్ నైట్గా పింక్ బంతులతో నిర్వహించనున్నారు. కివీస్తో సిరీస్కు ముందు భారత జట్టులోని అగ్రశ్రేణి ఆటగాళ్ళంతా ఈ టోర్నీలో పాల్గొని నైట్ టెస్టు మ్యాచ్ కోసం సన్నద్ధమవుతారని బోర్డు కార్యదర్శి చెప్పారు. సాధారణంగా ఇండియాలో టెస్టుల కోసం ‘ఎస్జీ’ బంతులను వాడతారు. అయితే డే అండ్ నైట్ టెస్టు కోసం మొదటిసారిగా ‘కూకాబుర్రా’ పింక్ బంతులను ఉపయోగిస్తారు.