ఈ ఏడాది భారత్ డే అండ్ నైట్ టెస్టు! | India to play first Day-Night Test this year, says Anurag Thakur | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది భారత్ డే అండ్ నైట్ టెస్టు!

Apr 22 2016 12:22 AM | Updated on Sep 3 2017 10:26 PM

భారత జట్టు తొలిసారిగా ఈ ఏడాది చివర్లో డే అండ్ నైట్ టెస్టు ఆడుతుందని ఠాకూర్ ప్రకటించారు.

భారత జట్టు తొలిసారిగా ఈ ఏడాది చివర్లో డే అండ్ నైట్ టెస్టు ఆడుతుందని ఠాకూర్ ప్రకటించారు. న్యూజిలాండ్‌తో సొంతగడ్డపైనే ఈ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఇంకా వేదికను నిర్ణయించలేదు. అయితే అంతకుముందు జరిగే దులీప్ ట్రోఫీని డే అండ్ నైట్‌గా పింక్ బంతులతో నిర్వహించనున్నారు. కివీస్‌తో సిరీస్‌కు ముందు భారత జట్టులోని అగ్రశ్రేణి ఆటగాళ్ళంతా ఈ టోర్నీలో పాల్గొని నైట్ టెస్టు మ్యాచ్ కోసం సన్నద్ధమవుతారని బోర్డు కార్యదర్శి చెప్పారు. సాధారణంగా ఇండియాలో టెస్టుల కోసం ‘ఎస్‌జీ’ బంతులను వాడతారు. అయితే డే అండ్ నైట్ టెస్టు కోసం మొదటిసారిగా ‘కూకాబుర్రా’ పింక్ బంతులను ఉపయోగిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement