'వరల్డ్ బాక్సింగ్' భారత్ ఆతిథ్యం | India to host maiden men's World Boxing Championship in 2021 | Sakshi
Sakshi News home page

'వరల్డ్ బాక్సింగ్' భారత్ ఆతిథ్యం

Jul 25 2017 4:04 PM | Updated on Sep 5 2017 4:51 PM

2021లో నిర్వహించబోయే పురుషుల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ ను భారత్లో నిర్వహించనున్నారు.

న్యూఢిల్లీ: 2021లో నిర్వహించబోయే పురుషుల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ ను భారత్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్(ఏఐబీఏ) తాజా ప్రకటనలో స్పష్టం చేసింది.

గత రెండు రోజులుగా వచ్చే ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీలను ఎక్కడ నిర్వహించాలనే దానిపై చర్చలు జరిపిన తరువాత భారత్ ను ఎంపిక చేస్తున్నట్లు ఏఐబీఏ ప్రకటించింది. తద్వారా తొలిసారి పురుషుల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీలకు భారత వేదిక కానుంది.


 

Advertisement
 
Advertisement
Advertisement