యువరాజ్ శ్రమ వృథా | India players lend boost to Vijay Hazare Trophy | Sakshi
Sakshi News home page

యువరాజ్ శ్రమ వృథా

Dec 11 2015 2:22 AM | Updated on May 28 2018 2:10 PM

యువరాజ్ శ్రమ వృథా - Sakshi

యువరాజ్ శ్రమ వృథా

విజయ్ హజారే వన్డే టోర్నీలో తొలి రోజు యువరాజ్ సింగ్ ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత దేశవాళీ మ్యాచ్ ఆడుతున్న ధోని బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు.

ధోని విఫలం విజయ్ హజారే వన్డే టోర్నీ రౌండప్
 సాక్షి, హైదరాబాద్: విజయ్ హజారే వన్డే టోర్నీలో తొలి రోజు యువరాజ్ సింగ్ ఆకట్టుకోగా, చాలా కాలం తర్వాత దేశవాళీ మ్యాచ్ ఆడుతున్న ధోని బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. గ్రూప్ ‘ఎ’లో యువరాజ్ (93 బంతుల్లో 93; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) సత్తా చాటినా... ముంబై చేతిలో పంజాబ్ జట్టు 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. పంజాబ్ 254 పరుగులకు ఆలౌట్ కాగా, కెరీర్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న జై బిస్తా (87 బంతుల్లో 92; 12 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ముంబై 5 వికెట్లకు 255 పరుగులు చేసి నెగ్గింది. అస్సాంతో జరిగిన మరో మ్యాచ్‌లో ముకుంద్ (104), అశ్విన్ (3/31) తమిళనాడును గెలిపించారు. 
 
 ఆలూరు: గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో జార్ఖండ్ 5 పరుగుల తేడాతో జమ్ము కశ్మీర్‌పై గెలుపొందింది. జార్ఖండ్ 210 పరుగులకు ఆలౌట్ కాగా, కశ్మీర్ 7 వికెట్లకు 205 పరుగులే చేయగలిగింది. ధోని (24 బంతుల్లో 9; 1 ఫోర్) విఫలమయ్యాడు. మరో మ్యాచ్‌లో రైల్వేస్ జట్టు డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటకపై వికెట్ తేడాతో సంచలన విజయం సాధించింది. 
 
 ఢిల్లీ: త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో (గ్రూప్ సి)  ఆంధ్ర 58 పరుగుల తేడాతో విజయం సాధించింది.  ఏజీ ప్రదీప్ (71), శివకుమార్ (51) అర్ధ సెంచరీల సహాయంతో ఆంధ్ర 273 పరుగులు చేసింది. అనంతరం త్రిపుర 215 పరుగులకే ఆలౌటైంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement