ఎదురులేని భారత్‌ | India continue winning run in T20 World Cup for blind, beat Sri Lanka by nine wickets | Sakshi
Sakshi News home page

ఎదురులేని భారత్‌

Feb 5 2017 1:30 AM | Updated on Sep 5 2017 2:54 AM

గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపాని చేతుల మీదుగా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకుంటున్న ప్రకాశ్‌

గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపాని చేతుల మీదుగా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకుంటున్న ప్రకాశ్‌

డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ అంధుల టి20 ప్రపంచకప్‌లో తమ జోరు కొనసాగిస్తోంది.

అంధుల టి20 ప్రపంచకప్‌
అహ్మదాబాద్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ అంధుల టి20 ప్రపంచకప్‌లో తమ జోరు కొనసాగిస్తోంది. శ్రీలంకతో శనివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్‌కిది ఐదో విజయం కావడం విశేషం. మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 186 పరుగులు చేసింది.

చందన దేశప్రియ (62; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా... భారత బౌలర్లలో సునీల్‌ మూడు, కెప్టెన్‌ అజయ్‌ కుమార్‌ రెడ్డి రెండు వికెట్లు తీశారు. 187 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్‌ 13.3 ఓవర్లలో కేవలం ఒక వికెట్‌ కోల్పోయి అధిగమించింది. ఓపెనర్‌ ప్రకాశ్‌ (99 నాటౌట్‌; 20 ఫోర్లు) సెంచరీకి పరుగు దూరంలో నిలువగా... కేతన్‌ (56 నాటౌట్‌) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 142 పరుగులు జోడించారు. పది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భారత్‌ 15 పాయింట్లతో పాక్, బంగ్లాదేశ్‌ జట్లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement