శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఆధిక్యం కనబరుస్తోంది.
గాలె: శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఆధిక్యం కనబరుస్తోంది. రెండో రోజు టీ విరామ సమయానికి టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది.
ధావన్(134), కోహ్లి(103) సెంచరీలు సాధించి అవుటయ్యారు. సాహా(7), హర్భజన్(4) క్రీజులో ఉన్నారు. భారత ఆటగాళ్లలో నలుగురు ఎల్బీడబ్యూగా అవుట్ కావడం గమనార్హం. మరో ఇద్దరు ప్రదీప్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 183 పరుగులకు ఆలౌటైంది.