ఫైనల్లో సాకేత్ జంట | Hyderabad Player Saket semifinal | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సాకేత్ జంట

Oct 24 2015 12:57 AM | Updated on Sep 7 2018 4:39 PM

ఫైనల్లో సాకేత్ జంట - Sakshi

ఫైనల్లో సాకేత్ జంట

ఎయిర్ ఆసియా ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని తన జోరు కొనసాగిస్తున్నాడు.

బెంగళూరు: ఎయిర్ ఆసియా ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని తన జోరు కొనసాగిస్తున్నాడు. సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకున్న అతను, డబుల్స్‌లో తన భాగస్వామి సనమ్ సింగ్‌తో కలిసి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 6-3, 7-6 (8/6)తో యానిక్ మెర్టెన్స్ (బెల్జియం)పై గెలుపొందాడు.  డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్-సనమ్ సింగ్ (భారత్) ద్వయం 6-4, 7-6 (7/3)తో గెరార్డ్ గ్రానోలెర్స్-అడ్రియన్ మెనెన్‌దెజ్ (స్పెయిన్) జంటపై విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement