
సన్రైజర్స్ అభిమానులు
హైదరాబాద్ : ‘‘అబ్బా.. మ్యాచ్లో శిఖర్ ధావన్ ఉన్నా అయిపోవు.. డేవిడ్ వార్నర్ ఉన్నా ఈ పరిస్థితే వచ్చేది కాదు.. కనీసం కరణ్ శర్మ ఆపిన సిక్సు వెళ్లినా.. విలియమ్సన్, పఠాన్లలో కడదాక ఒక్కరు నిలిచినా విజయం దక్కేది..’’ అని సగటు హైదరాబాద్ అభిమాని మదిలో మెదులుతున్న మాటలు.. సొంత మైదానం.. సొంత జట్టు గెలవాలనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. కడదాక ఊరించిన విజయం తృటిలో చేజారింది. ఉప్పల్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ నాలుగు పరుగుల తేడాతో ఓటమి చెందింది. ఈ పరాజయం అభిమానులను నిరాశ పరిచినా.. సన్రైజర్స్ ఆటగాళ్ల పోరాట పటిమ మజానిచ్చింది. పటిష్ట చెన్నైకి ఏమాత్రం తగ్గకుండా సన్రైజర్స్ గట్టి పోటీనిచ్చింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం మైదానంలోని కొందరు అభిమానుల కంటతడి పెట్టారు. తమ అభిమాన జట్టుకు అదృష్టం కలిసి రాలేదని ఆవేదన చెందారు.