సెమీస్‌కు దూసుకెళ్లిన సానియా జోడీ  | Hobart International Tournament: Sania Mirza Continues Dream Comeback | Sakshi
Sakshi News home page

సెమీస్‌కు దూసుకెళ్లిన సానియా జోడీ 

Jan 17 2020 1:52 AM | Updated on Jan 17 2020 1:52 AM

Hobart International Tournament: Sania Mirza Continues Dream Comeback - Sakshi

హోబర్ట్‌: పునరాగమనంలో ఆడుతోన్న తొలి టోర్నీలోనే భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా అదరగొడుతోంది. హోబర్ట్‌ ఇంటర్నేషనల్‌ మహిళల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో గురువారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సానియా– నదియా కిచెనోక్‌ (ఉక్రెయిన్‌) ద్వయం 6–2, 4–6, 10–4తో అమెరికా ద్వయం క్రిస్టీనా మెక్‌హేల్‌–వనియా కింగ్‌పై గెలిచింది. గంటా 24 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ అద్భుతంగా ఆడింది. నేడు జరిగే సెమీస్‌లో పోరులో టమరా జిదాన్‌సెక్‌ (స్లోవేనియా)– మేరి బౌజ్‌కోవా (చెక్‌ రిపబ్లిక్‌) జోడీతో సానియా– కిచెనోక్‌ ద్వయం తలపడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement