జరిమానా కోరుకోను...

Do not want to get fined: Dhoni   - Sakshi

దుబాయ్‌: అఫ్గాన్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో అంపైరింగ్‌ పొరపాట్లపై స్పందించేందుకు ఎంఎస్‌ ధోని నిరాకరించాడు. ఈ మ్యాచ్‌లో ధోని, దినేశ్‌ కార్తీక్‌లను ఎల్బీగా ప్రకటించడం అంపైరింగ్‌ లోపాలను ఎత్తిచూపింది. అయినా, వీటిపై మాట్లాడనని ధోని పేర్కొన్నాడు.

‘మ్యాచ్‌లో జరిగిన కొన్ని ఘటనలపై స్పందించి జరిమానాకు గురికాదల్చుకోలేదు’ అని అతడు వివరించాడు. అఫ్గానిస్తాన్‌ బాగా ఆడిందని, ఈ పిచ్‌పై 250 మంచి స్కోరే అని పేర్కొన్నాడు. గెలవకున్నా, ఫలితం పట్ల సంతృప్తి చెందినట్లు తెలిపాడు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top