ధోని చమత్కారం

Dhoni Not Wish Fined For Speaking About Certain Things - Sakshi

దుబాయ్‌: తాను జరిమానా ఎదుర్కొవడానికి సిద్ధంగా లేనని మిస్టర్‌ కూల్‌ ఎంఎస్‌ ధోని చమత్కరించాడు. అఫ్గానిస్తాన్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌ ఫలితంపై సంతృప్తిగా ఉన్నట్టు చెప్పాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌ ‘టై’గా ముగిసింది.

మ్యాచ్‌ ముగిసిన తర్వాత ధోని మాట్లాడుతూ.. ‘ఛేజింగ్‌లో మేము ఎటువంటి పొరపాట్లు చేయలేదు. ఓపెనర్ల నుంచి శుభారంభం లభించినప్పటికీ మ్యాచ్‌ జరిగేకొద్ది బౌలర్లకు పిచ్‌ అనుకూలంగా మారింది. ఎవరో ఒకరు బాగా బ్యాటింగ్‌ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ దశలో కొన్ని అంశాలు మాకు ప్రతికూలంగా మారాయి. మరోవైపు మేము పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగలేదు. సరిపడా స్పిన్నర్లు కూడా లేరు. సీమర్లు స్వింగ్‌ చేయలేకపోయారు. దీంతో ఆరంభంలో పరుగులు ఎక్కువగా సమర్పించుకున్నామ​’ని తెలిపాడు.

రనౌట్లు, మరికొన్ని అంశాలు(తప్పుడు ఎల్బీ నిర్ణయాలు) కారణంగానే మ్యాచ్‌ను ఫలితం తేలకుండా ముగించాల్సి వచ్చిందన్నాడు. వాటి (అంపైర్ల నిర్ణయాలు) గురించి మాట్లాడి జరిమానా ఎదుర్కొవాలని అనుకోవడం లేదని సరదాగా అన్నాడు. అఫ్గానిస్తాన్‌ ఆటగాళ్లు చాలా బాగా ఆడారని కితాబిచ్చాడు. ఈ పిచ్‌లో 250 పరుగులు చాలా మంచి స్కోరని, ఈ మ్యాచ్‌ను బాగా ఆస్వాదించామని పేర్కొన్నాడు. అఫ్గానిస్తాన్‌ బౌలింగ్‌, ఫీల్డింగ్‌ మెరుగ్గా ఉందని ధోని మెచ్చుకున్నాడు. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top