ఆక్లాండ్: ప్రపంచంలో బెస్ట్ అనుకున్న నాలుగు జట్లే వరల్డ్కప్ సెమీస్కు చేరుకున్నాయని న్యూజిలాండ్ కోచ్ మైక్ హెస్సన్ అన్నారు. ఇందులో చర్చించడానికి ఏమీ లేదన్నారు. వన్డేల్లో దిగ్గజ జట్ల సరసన చోటు సాధించే సత్తా తమకు ఉందన్నారు. ‘సెమీస్కు చేరిన నాలుగు జట్లు ప్రస్తుతం అత్యంత పటిష్టంగా ఉన్నాయి. దీన్ని కొంత మంది అంగీకరించకపోయినా ఫర్వాలేదు’ అని హెస్సన్ పేర్కొన్నారు. మరోవైపు విండీస్పై ఘనవిజయం సాధించిన కివీస్ను స్థానిక మీడియా ఆకాశానికెత్తేసింది. వచ్చే మంగళవారం దేశం మొత్తానికి హాలీడే అని ఓ రేడియో స్టేషన్ వ్యాఖ్యానించింది.
తమ జట్టు సెమీస్కు చేరుకున్నందుకు విశేషంగా సంబరాలు చేసుకుంటున్న అభిమానులు ఫైనల్ వరకు ఇదే జైత్రయాత్రను కొనసాగాలని కోరుకుంటున్నారు. దక్షిణాఫ్రికాతో సెమీస్ గురించి కోచ్ మాట్లాడుతూ... ‘తనదైన రోజున సఫారీలు అద్భుతంగా ఆడతారు. అయితే వాళ్లను ఒత్తిడిలో ఉంచాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. రెండు జట్లూ మంచి క్రికెట్ ఆడుతున్నాయి.
కాబట్టి హోరాహోరీ పోరు తప్పకపోవచ్చు. ప్రస్తుతం కివీస్ మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇప్పటివరకు నేను చూసిన వాటిల్లో గప్టిల్ ఇన్నింగ్స్ అద్భుతమైనది. అతను ఆడిన తీరు అమోఘం. టైమింగ్, షాట్ల ఎంపిక, పరిస్థితులను అన్వయించుకోవడం సూపర్బ్. బౌల్ట్ కూడా చక్కగా బౌలింగ్ వేశాడు. ఇక వెటోరి క్యాచ్ను వర్ణించలేం. 36 ఏళ్ల వయసులో అతను అంతపైకి ఎగురుతాడని ఊహించలేదు’ అని హెస్సన్ వివరించారు.
సఫారీతో హోరాహోరీ తప్పదు: కివీస్ కోచ్ హెస్సన్
Published Mon, Mar 23 2015 12:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement