పాక్‌తో పోరుకు బోపన్న దూరం

Bopanna Pulls Out Of Davis Cup Tie Against Pakistan - Sakshi

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ జట్టుతో ఈనెల 29, 30 తేదీల్లో జరగాల్సిన డేవిస్‌ కప్‌ ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 మ్యాచ్‌ నుంచి భారత టెన్నిస్‌ డబుల్స్‌ నంబర్‌వన్‌ ప్లేయర్‌ రోహన్‌ బోపన్న వైదొలిగాడు. భుజం గాయం కారణంగా తాను అందుబాటులో ఉండటం లేదని భారత జట్టు నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌ రోహిత్‌ రాజ్‌పాల్‌కు బోపన్న సమాచారం ఇచ్చాడు. 39 ఏళ్ల బోపన్న స్థానంలో జీవన్‌ నెడుంజెళియన్‌ జట్టులోకి వచ్చాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top