అసదుద్దీన్‌ అజేయ సెంచరీ

asaduddin hits a ton - Sakshi

8 వికెట్లతో నేషనల్‌ సీసీ గెలుపు

ఉస్మానియాతో మ్యాచ్‌  

సాక్షి, హైదరాబాద్‌: హెచ్‌సీఏ ఎ–2 డివిజన్‌ రెండు రోజుల క్రికెట్‌ లీగ్‌లో నేషనల్‌ సీసీ జట్టు బ్యాట్స్‌మన్‌ మొహమ్మద్‌ అసదుద్దీన్‌ (84 బంతుల్లో 127 నాటౌట్‌; 9 ఫోర్లు, 9 సిక్సర్లు) మెరుపు సెంచరీతో కదం తొక్కాడు. దీంతో ఉస్మానియా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో నేషనల్‌ సీసీ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట ఉస్మానియా జట్టు 56 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది. దీపాంకర్‌ (65) అర్ధసెంచరీ చేయగా, అవినాశ్‌ (34 నాటౌట్‌) రాణించాడు. నేషనల్‌ సీసీ బౌలర్లలో షరీఫ్‌ జుబేర్‌ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం అసదుద్దీన్‌ చెలరేగడంతో స్వల్ప లక్ష్యాన్ని నేషనల్‌ సీసీ అలవోకగా ఛేదించింది. 24.5 ఓవర్లలో 2 వికెట్లకు 176 పరుగులు చేసి గెలిచింది.  

మరో మ్యాచ్‌ వివరాలు
సీసీఓబీ: 252 (67.2 ఓవర్లలో), టీమ్‌ స్పీడ్‌: 253/7 (కె. ప్రజ్వల్‌ 52, హిమతేజ 57, గణేశ్‌ 59 నాటౌట్, శ్రీనాథ్‌ రెడ్డి 36; సయ్యద్‌ సల్మాన్‌ 4/50).
 రాకేశ్‌ ఎలెవన్‌: 217 (56 ఓవర్లలో), నిజాం కాలేజి: 221/7 (సాయి కుమార్‌ 39, హరిహర నాయక్‌ 41, టి. అక్షయ్‌ 77 నాటౌట్‌; అనిరు«ద్‌ నడిపల్లి 3/28).

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top