మరో ఇద్దరిపై వేటు | Another two are Avoided | Sakshi
Sakshi News home page

మరో ఇద్దరిపై వేటు

Jun 8 2015 1:41 AM | Updated on Oct 9 2018 6:36 PM

పదవిలోకి వచ్చిన తర్వాత శ్రీనివాసన్ సంబంధీకులను బోర్డు నుంచి సాగనంపుతున్న బీసీసీఐ కొత్త కార్యవర్గం తాజాగా మరో ఇద్దరిని తప్పించింది.

ముంబై : పదవిలోకి వచ్చిన తర్వాత శ్రీనివాసన్ సంబంధీకులను బోర్డు నుంచి సాగనంపుతున్న బీసీసీఐ కొత్త కార్యవర్గం తాజాగా మరో ఇద్దరిని తప్పించింది. శ్రీనివాసన్ సన్నిహితులుగా గుర్తింపు తెచ్చుకున్న టీమ్ లాజిస్టిక్ మేనేజర్ ఎంఏ సతీశ్, మీడియా మేనేజర్ ఆర్‌ఎన్ బాబాలను ఆ పదవుల నుంచి తొలగించింది. 2011 నుంచి మధ్యలో కొద్ది రోజులు మినహా సతీశ్... 2012 టి20 ప్రపంచకప్ నుంచి బాబా భారత జట్టు సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్నారు.

ఇప్పటి వరకు సతీశ్‌కు నెలకు రూ. 6 లక్షలు, బాబాకు ప్రతీ టూర్‌కు రూ. 5 లక్షల చొప్పున బోర్డు చెల్లించినట్లు సమాచారం. బంగ్లా పర్యటనకు సతీశ్ స్థానంలో రిషిక్ ఉపాధ్యాయను ఎంపిక చేయగా, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ బిశ్వరూప్ డే మీడియా మేనేజర్‌గా కూడా వ్యవహరిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement