చెన్నైకి పాకిస్థాన్ స్పిన్నర్లు | Ajmal, Hafeez to visit Chennai for informal tests | Sakshi
Sakshi News home page

చెన్నైకి పాకిస్థాన్ స్పిన్నర్లు

Dec 24 2014 9:53 AM | Updated on Mar 23 2019 8:32 PM

చెన్నైకి పాకిస్థాన్ స్పిన్నర్లు - Sakshi

చెన్నైకి పాకిస్థాన్ స్పిన్నర్లు

సందేహాస్పద బౌలింగ్ శైలి కారణంగా నిషేధం ఎదుర్కొంటున్న పాకిస్తాన్ క్రికెట్ స్పిన్నర్లు సయీద్ అజ్మల్‌, మొహమ్మద్ హఫీజ్‌ చెన్నైకి వెళ్లనున్నారు.

కరాచీ: సందేహాస్పద బౌలింగ్ శైలి కారణంగా నిషేధం ఎదుర్కొంటున్న పాకిస్తాన్ క్రికెట్ స్పిన్నర్లు సయీద్ అజ్మల్‌, మొహమ్మద్ హఫీజ్‌ చెన్నైకి వెళ్లనున్నారు. ఐసీసీ గుర్తింపు పొందిన చెన్నై బౌలింగ్ సెంటర్ లో తమ బౌలింగ్ యాక్షన్ ను వారు పరీక్షించుకోనున్నారు.

అజ్మల్‌, హఫీజ్‌ అభ్యర్థన మేరకు వారిని చెన్నై పంపుతున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తెలిపింది. వారి పర్యటన ఖరారైందని వెల్లడించింది. భారత హైకమిషన్, తమ విదేశాంగ శాఖ అనుమతి కూడా లభించిందని తెలిపింది. రెండు, మూడు రోజుల్లో అజ్మల్‌, హఫీజ్‌ చెన్నైకి బయలుదేరతారని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement