98 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్ | Sakshi
Sakshi News home page

98 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్

Published Mon, Dec 29 2014 9:25 AM

98 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్

మెల్బోర్న్: భారత్తో మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా మరో వికెట్ కోల్పోయింది. మ్యాచ్ నాలుగో రోజు సోమవారం లంచ్ విరామం తర్వాత వర్షం తెరిపినివ్వడంతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ కాసేపటికే వికెట్ చేజార్చుకుంది. 98 పరుగుల వద్ద వాట్సన్ (17)ను ఇషాంత్ అవుట్ చేశాడు. వాట్సన్ వికెట్ల వెనుక ధోనీకి దొరికిపోయాడు. అంతకుముందు వార్నర్ (40)ను అశ్విన్ అవుట్ చేశాడు. 462/8 ఓవర్నైట్ స్కోరుతో ఈ రోజు ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో మూడు పరుగులు మాత్రమే చేసి చివరి రెండు వికెట్లు కోల్పోయింది.

Advertisement
Advertisement