వైజాగ్లో 3 ఐపీఎల్ మ్యాచ్లు | 3 IPL matches to be held in vijaz | Sakshi
Sakshi News home page

వైజాగ్లో 3 ఐపీఎల్ మ్యాచ్లు

Feb 11 2015 5:33 PM | Updated on Sep 2 2017 9:09 PM

వైజాగ్లో 3 ఐపీఎల్ మ్యాచ్లు

వైజాగ్లో 3 ఐపీఎల్ మ్యాచ్లు

విశాఖపట్నం మూడు ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది.

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2015 షెడ్యూల్ను విడుదల చేశారు. 47 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్లో ప్లే ఆఫ్ మ్యాచ్లతో సహా మొత్తం 60 మ్యాచ్లు జరగనున్నాయి.

విశాఖపట్నం మూడు ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడే మ్యాచ్లు ఈ వేదికపై జరగనున్నాయి. ఐపీఎల్ సీజన్ ఏప్రిల్ 8న ఆరంభంకానుంది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్, మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. దేశవ్యాప్తంగా పలు వేదికలపై ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి.  ఫైనల్ మ్యాచ్కు కోల్కతా ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమివ్వనుంది.

Advertisement
 
Advertisement
Advertisement