సర్జికల్‌ స్ట్రైక్‌ : పాకిస్తాన్‌పై కుళ్లు జోకులు

Twitter Taken Over By Memes And Jokes Poking Fun at Pakistan After India Airstrikes - Sakshi

భారత సైన్యం జరిపిన దాడులకు ఇమ్రాన్‌ ఖాన్‌కు అయితే జ్వరం పట్టుకుందని..

న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత వైమానిక దళం జరిపిన మెరుపు దాడుల నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా దాయాదీ దేశంపై కుళ్లు జోకులు పేలుతున్నాయి. పాక్‌ను టార్గెట్‌ చేస్తూ భారత నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌, ట్వీట్స్‌, వీడియోలను ట్రెండ్‌ చేస్తున్నారు. #Surgicalstrike2,  #Balakot, #IndiaStrikesBack, #IndianAirForce #airstrike యాష్‌ ట్యాగ్‌లతో పాక్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. భారత సైన్యం జరిపిన దాడులకు పాక్‌ తోక ముడిచిందని, భయంతో చేతులెత్తిందని, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు అయితే జ్వరం పట్టుకుందని కామెంట్‌ చేస్తున్నారు. ఇక ఈ దాడులపై క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు సైతం భారత వైమానిక దళాన్ని కొనియాడుతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

మంగళవారం తెల్లవారుజామున ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్‌లో భారత వైమానిక దళం మెరుపుదాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో సుమారు 300 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది.  12 మిరాజ్‌-200 జైట్‌ ఫైటర్స్‌తో భారత వాయిసేన సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top