‘చంద్రబాబు కామెడీ చూసి జనం నవ్వుకుంటున్నారు’ | YSRCP MP Vijayasai Reddy Criticize Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Dec 17 2018 4:13 PM | Updated on Dec 17 2018 4:29 PM

YSRCP MP Vijayasai Reddy Criticize Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాలు పెట్టారో లేదో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ గల్లంతైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. తాను ఎం చెప్పినా కుల మీడియా ద్వారా ప్రజలను నమ్మించొచ్చని చంద్రబాబు భ్రమ పడుతున్నారని విమర్శించారు. గెలుపైతే నాది, ఓటమైతే మీదన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబు కామెడీ చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఓటమి గురించి మాట్లాడని చంద్రబాబు ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ విజయాన్నిమాత్రం తన ఖాతాలో వేసుకున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement