తిరిగి సొంత పార్టీలోకి చేరిన వైఎస్‌ఆర్‌సీపీ నేత | YSRCP MLA Kodali Nani Slams CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

తిరిగి సొంత పార్టీలోకి చేరిన వైఎస్‌ఆర్‌సీపీ నేత

Dec 31 2017 4:38 PM | Updated on May 29 2018 4:40 PM

YSRCP MLA Kodali Nani Slams CM Chandrababu Naidu - Sakshi

సాక్షి, గుడివాడ : ఇటీవల మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరిన గుడివాడ మున్సిపల్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ రవికాంత్‌ తిరిగి సొంత పార్టీలో చేరారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి రవికాంత్‌ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీడీపీ నేతల కుట్రలు, బెదిరింపులను ఆయన మీడియా సమక్షంలో బయట పెట్టారు. త్వరలోనే టీడీపీ నేతలు తనను ఏ విధంగా ప్రలోభపెట్టారో ఆధారాలతో సహా బయటపెడతానని స్పష్టం చేశారు. చం‍ద్రబాబు వైఎస్సార్‌సీపీ నాయకులను ప్రలోభ పెట్టి రాజకీయం చేస్తే ఇలాంటి సంఘటనలే జరుగుతాయని ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement