వైఎస్సార్సీపీ ముఖ్య నాయకుల సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. మూడు రాజధానుల ఏర్పాటు, రైతుల ఆందోళన, రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలు, రైతులకు భరోసా ఇవ్వడం తదితర అంశాల గురించి ఈ భేటీలో చర్చ జరుగనున్నట్లు సమాచారం.
ఇక ఈ సమావేశానికి పార్టీ ముఖ్య నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కొడాలి నాని, పేర్ని నాని, శ్రీరంగనాథ రాజు, మోపిదేవి వెంకటరమణ, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. అదే విధంగా అన్న బత్తుల శివకుమార్, విడదల రజని, ముస్తఫా, పార్థసారథి, వసంత కృష్ణ ప్రసాద్, మేక ప్రతాప్ అప్పారావు, ఉండవల్లి శ్రీదేవి, ఆర్కే తదితర ఎమ్మెల్యేలు.. లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్, మర్రి రాజశేఖర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.