చంద్రబాబు గజదొంగ.. లోకేష్‌ డేటా దొంగ

YSRCP Leader Sudhakar Babu Fires On Chandrababu - Sakshi

20 రోజుల్లో చంద్రబాబు చెంప పగిలే తీర్పు

ఐటీ మంత్రి ప్రెస్‌మీట్‌ పెట్టడేం.. పెడితే దొరికిపోతాడా?

వైఎస్సార్‌సీపీనేత సుధాకర్‌ బాబు ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌ : వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మరణశాసనం తప్పదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి సుధాకర్‌ బాబు జోస్యం చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  తాను నమ్ముకున్న జేబు మీడియా సంస్థల ద్వారా చంద్రబాబు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌కు లేనిపోని నిందలు ఆపాదిస్తున్నారని, జగన్‌ స్థాయిని తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల్లో వైఎస్‌ జగన్‌కు ఆకాశమంత విశ్వసనీయత ఉందని, దాన్ని ఎవరు చెరపలేరన్నారు. హిందుజా భూ వ్యవహారంలో ఎలాంటి చర్చకైనా తమ పార్టీ సిద్ధమని సవాల్‌ విసిరారు. 20 రోజుల్లో చంద్రబాబుకు చెంప పగులకొట్టే తీర్పును ప్రజలు ఇవ్వబోతున్నారని జోస్యం చెప్పారు.

చంద్రబాబు పాలనలో దోపిడీ, అవినీతి విచ్చలవిడిగా జరిగిందని, జన్మభూమి కమిటీలు దోపిడీ కమిటీలుగా మారాయన్నారు. వైఎస్‌ జగన్‌పై నిందలు వేయడం దారుణమని, అవినీతి చక్రవర్తి చంద్రబాబేనని దుయ్యబట్టారు. చంద్రబాబు గజదొంగైతే.. లోకేష్‌ డేటా దొంగని విమర్శించారు. డేటా దొంగతనం జరిగితే.. ఐటీ మంత్రి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటంలేదని, పెడితే దొరికిపోతాడా? అని ప్రశ్నించారు. ఐటీ మంత్రి బదులు పెయిడ్‌ ఆర్టిస్ట్‌, సినిమాలు లేనివాడితో మాట్లాడిస్తున్నారేందని ఎద్దేవా చేశారు.  ఏ ఎన్నికల్లో సూటిగా గెలవలేని దద్దమ్మ చంద్రబాబని, వచ్చే 30 రోజుల్లో రాజన్న రాజ్యం కచ్చితంగా వస్తుందని సుధాకర్‌ బాబు ధీమా వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top