‘త్వరలో రాజన్న రాజ్యం వస్తుంది’

YSRCP Leader Ali Speech At Kavali Meeting - Sakshi

సాక్షి, నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంటే తనకు చాలా ఇష్టమని వైఎస్సార్‌సీపీ నాయకుడు, ప్రముఖ సినీ నటుడు అలీ తెలిపారు. గురువారం ఆర్‌ఎస్‌ఆర్‌ కల్యాణ మండపంలో జరిగిన కావలి నియోజకవర్గ ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో పేదలను పార్టీలకు అతీతంగా వైఎస్సార్‌ ఆదుకున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇస్తే తప్పరని తెలిపారు. రాష్ట్రానికి జగన్‌ రావాలి-జగన్‌ కావాలి అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్‌ జగన్‌ అవసరం ఎంతో ఉందన్నారు. భగవంతుడు ఉన్నాడని.. మంచి రోజులు వస్తాయని అన్నారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని తెలిపిన ఆయన.. ఈ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ను గెలిపించి సీఎంను చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.(జగన్‌తో నా పరిచయం 22 ఏళ్లు: నటుడు అలీ)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top