‘సుహాసినిని బలిపశువుని చేశారు’

YS Jagan Birthday Celebrations At AP YSRCP Office - Sakshi

సాక్షి, విజయవాడ :  ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నటుడు పృథ్వీ విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ పంచె లాక్కెళ్లి చంద్రబాబు రాహుల్ గాంధీకి కప్పారని వ్యాఖ్యానించారు. తన స్వార్థం కోసం నందమూరి సుహాసినిని బాబు బలిపశువుని చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాన్ గాలి 30 ఏళ్ల పాటు ప్రజలకు అందాలని ఆకాక్షించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆయన పాల్గొన్నారు.

‘మా అధినేత పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. తెలుగు జాతి గర్వించే నాయకుడు వైఎస్‌ జగన్‌. ఆయనను త్వరలో సీఎంగా చూడబోతున్నాం. వైఎస్‌ జగన్‌ను రాష్ట్ర భవిష్యత్‌గా ప్రజలు అభివర్ణిస్తున్నారు. ఆయనకు దుర్గాదేవి ఆశీస్సులు ఉంటాయ’ని నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు.

కృష్ణా జిల్లా డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్‌ డాక్టర్ మెహబూబ్ షేక్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. సీనియర్‌ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కంటి, షుగర్ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 47 కిలోల భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. వచ్చే ఏడాది సీఎం హోదాలో వైఎస్ జగన్‌ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారని ఆకాంక్షించారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరారు.

పార్టీ ముఖ్య నేతలు కొలుసు పార్థసారథి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, విజయచందర్, గౌతమ్ రెడ్డి, యలమంచిలి రవి, బొప్పన భవకుమార్, అడపా శేషు, ఎంవీఆర్‌ చౌదరి, తోట శ్రీనివాస్, కాలే పుల్లారావు, వెంకటేశ్వర శర్మ, అవుతు శ్రీనివాస్ రెడ్డి, దొడ్డా అంజిరెడ్డి, ఆసిఫ్ వేడుకల్లో పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top